Dr.B.R.AMBEDKAR (1891-1956)
B.A., M.A., M.Sc., D.Sc., Ph.D., L.L.D., D.Litt., Barrister-at-Law.
1891: April 14న రాంజీ మాలోజి సక్పాల్ , భీమాబాయి దంపతులకు ఇప్పటి మధ్యప్రదేశ్ లోని "మౌ" పట్టణం లో జన్మించారు.
అంబేద్కర్ తండ్రి రాంజీ మాలోజి సక్పాల్ . |
1908:బొంబాయి లో ఎల్ఫిన్ స్టోన్ కళాశాలలో మెట్రిక్యులేసన్ పూర్తి చేసారు. |
1905:14వ యేట రామాభాయితో వివాహం జరిగింది |
1913:బరోడా రాజు ఆర్ధిక సహాయంతో ఉన్నత విద్య నిమిత్తం అమెరిఅకా లోని కొలంబియా యూనివర్సిటీ కి వెళ్ళారు . |
1916:ఆర్ధిక శాస్త్రంలో M.A. డిగ్రీ నిమిత్తం 'ప్రాచీన భారత వాణిజ్యం' అనే గ్రంధాన్ని రచించారు.National devidents of India అనే అంశంపై పరిశోధించి PHD పొందారు.
|
బుద్ధుడు..!ఈ పేరు మదిలో కి రాగానే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, ధ్యాన ముద్ర లో ఉన్న భోధి సత్వుడి నిర్మల రూపం మనకు గుర్తుకు వస్తుంది .అహింసా సిద్ధాంతం గుర్తుకు వస్తుంది.జీవికి కష్టాలెందుకు? అని ఆలోచించి ,అన్వేషణ మొదలుపెట్టిన గొప్పతనం జ్ఞాపకాని కి వస్తుంది.చింతలన్నింటికి కోరికలే కారణం అని నిగ్గు తేల్చిన అపూర్వ మేదస్సు సాక్షాత్కరిస్తుంది .శాంతం తో కోపాన్ని ,సాత్వికత తో హింసను దానం తో లోకాన్ని ,ప్రేమ తో ద్వేషాన్ని ,సత్యం తో అసత్యాన్ని జయించండి .సర్వ ప్రాణుల పట్ల సానుభూతి ని కలిగి ఉండటమే నిజమైన ధర్మం ,మతమని ప్రపంచానికి చాటిన మహానీయుడు .అందుకే ఆయన జన్మించి 2500 ఏళ్ళు గడిచినా, ఆయన చూపిన మార్గం ఇంకా అప్రతిహతంగా సాగిపోతుంది .
గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్డార్తుడు. క్రీ.పూ. 563 లో శుద్దోదనుడు,మహా మాయాదేవి దంపతులకు కపిలవస్తు సమీపంలో లుంబిని గ్రామంలో జన్మించాడు.రాచ కుటుంబం లో పుట్టిన ఆయన కొన్నేళ్ళ పాటు సకల సుఖాలను అనుభవించాడు .యశోధరను వివాహమాడాడు .వారికి రాహులుడు అనే కుమారుడు ఉన్నాడు.ఒకరోజు ఆయన వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు తొలిసారిగా ఆయన వృద్ధుడి ని , రోగిని ,మృతదేహాన్ని చూసాడు .ఇది ఆయన మదిలో కలతను మిగిల్చింది.ఈతి బాధలను గూర్చి ఆయనకు తెలియ వచ్చింది.దు:ఖానికి కారణాన్ని వెతకాలని నిశ్చయించుకున్నాడు .అదే సకల సౌక్యాలను ,కుటుంబాలను త్యజించి ,సన్యాసి గా మారాడు .దేశాటన చేస్తూ గయకు సమీపం లో ని నిరంజన తటాకం వద్దకు చేరాడు.క్రీ.పూ.531 వ సంవత్సరం లో రావి చెట్టు (బోధి చెట్టు) కింద కూర్చొని కొన్ని రోజుల పాటు ధ్యానం లో మునిగిపోయాడు.శరీరం శుస్కించినా ,చర్మం ,ఎముకలు,మాంసం కరిగిపోయినా ,జ్ఞానోదయం కానిదే ధ్యానం నుంచి కదల రాదని గట్టిగా తీర్మానించుకున్నాడు.ఆయన ఆశయం సిద్ధించి జ్ఞానోదయం అయ్యింది .ఈతి బాధల నుండి జ్ఞానోదయం అయ్యింది.అప్పుడు సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు .
ఇదే "నా చివరి జన్మ, ఇక ముందు నాకు ఎలాంటి జన్మలూ ఉండవు" అన్నవి ఆయన తొలి మాటలుగా చెబుతారు.ఆ తర్వాత సారానాద్ చేరుకొని తొలిసారిగా శిష్యుల కు ఉపదేశం చేసాడు.దీనిని "ధర్మ చక్ర పరివర్తనం" అంటారు. అప్పటి నుంచి తన ప్రవర్తన తో,తన ప్రవచన, ప్రభోదనలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు .
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
ప్రతి ఒక్కరు ఈ మూడు సూత్రాలను అనుసరించాలని హితవు చెప్పాడు.కోరికలే దు:ఖాని కి కారణం అని తేల్చాడు .వాటిని ఎలా జయించాలో శోదించాడు.సృష్టిలో ఏది శాశ్వతం కాదని ,మంచి చెడు ఏదైనా వచ్చి పోయెవని చెప్పారు.
సుత్త,వినయ ,అభిదమ్మ అనే 3 పిటకాలను బుద్హుడు అందించాడు .ఇవన్ని పాళీ భాష లో ఉన్నాయి .బౌద్ధులు ఆచరించాల్సిన జీవన విదానాలను ఇందులో పొందు పరిచారు.జీవ హింస చేయరాదు,అబద్దం ఆడరాదు ,ఇతరుల ఆస్తిని ఆశించరాదు,ముక్త పానీయాలను సేవించరాదు ,అవి నీతి పనులు చేయరాదు అనే పంచ శీల సూత్రాలను భోధించారు.నీతి నియమాలతో కూడిన అష్టాంగ మార్ఫ్గాన్ని సూచించారు.ఇందులో సరైన ద్రుష్టి,సత్య సంకల్పం ,సత్య వాక్కు ,సత్కర్మ ,సత్య జీవనం ,సత్య యత్నం ,సత్య లక్ష్యం అనే 8 విధాలు ఉంటాయి.క్రీ.పూ.483 లో కుశీ నగరం లో కాకుస్థ నదీ తీరాన బుద్హుడు మహా పరి నిర్వాణం చెందాడు .ప్పాడు .ఈ అశాశ్వత సిద్దాంతాన్ని అర్ధం చేస్కొని ,మేలు ,కీడు దేనికి పొంగి పోకుండా ,క్రుంగి పోకుండా తామరాకు పై నీటి బొట్టులా ఉండాలని బోధించాడు.అప్పుడు జీవితంలో దు:ఖానికి తావే ఉండదని తేల్చి చెప్పాడు .ఏ జీవిని హింసించ వద్దని హితవు పలికాడు.ఇంద్రియాలను నియంత్రణ లో ఉంచుకుంటూ ,కష్ట సుఖాలకు అతీతంగా ఉండాలన్నాడు.మనస్సును శ్వాస మీద లగ్నం చేస్తే చింత ,చింతన ఉండదంటూ విపస్సనా పద్దతిని తేలిగ్గా భోదించాడు .ధ్యాన పద్ధతి ని అనుసరిస్తే కష్టం ,దు:ఖం తలెత్తవని చెప్పాడు.
"సంయోగ ద్రవమంతా నశిస్తుంది.జ్ఞానం పొందాడానికి తీవ్రంగా ప్రయత్నిచండి " అన్నవి బుద్హుడి చివరి వాక్కులు.
అనేక మతాల అహింసను ప్రభోధించుటకు బుద్హుడే ప్రేరణ.
No comments:
Post a Comment